రామ్ చరణ్ అభిమానులను టెన్షన్ పెడుతున్న భారతీయుడు 2 !

Seetha Sailaja
28 సంవత్సరాల క్రితం విడుదలైన ‘భారతీయుడు’ అప్పట్లో ఒక సంచలనం. ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ అదేవిధంగా అప్పటి నేషనల్ మీడియా ఆసినిమాను ఆకాశంలోకి ఎత్తెసత్తు ప్రశంసలు కురిపించాయి. ఇప్పుడు ఆసినిమా మ్యానియాను గుర్తు చేయాలని దర్శకుడు శంకర్ మరొకసారి ‘భారతీయుడు 2’ మూవీ ద్వారా ప్రయత్నించడంతో ఆమూవీ పై విపరీతమైన అంచనాలు వచ్చాయి.

అయితే నిన్న విడుదలైన ఈమూవీ ఏమాత్రం ఆ అంచనాలను అందుకోకపోవడంతో ఫ్లాప్ టాక్ ను తెచ్చుకోవడం టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. శంకర్ లాంటి టాప్ దర్శకుడు ఇలాంటి సినిమాను ఎందుకు తీశాడు అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కథ విషయంలో కానీ కథనం విషయంలో కానీ ఎటువంటి కొత్తదనం లేకపోవడంతో ఈసినిమాను చూసిన సగటు ప్రేక్షకుడు అసహనానికి లోనవుతున్నాడు.

ఇప్పుడు ఈవిషయాలు అన్నీ రామ్ చరణ్ అభిమానులకు టెన్షన్ కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చరణ్ తో శంకర్ తీస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ పై ‘భారతీయుడు 2’ ప్రభావం ఎంతోకొంత ఉంటుందని చరణ్ అభిమానుల ఆవేదన. వాస్తవానికి ఈమూవీ ఇప్పటికే విడుదల కావలసి ఉన్నప్పటికీ శంకర్ తన దృష్టిని అంతా ‘భారతీయుడు 2’ పై పెట్టడంతో ఈమూవీ విడుదల ఆలస్యం అయింది.

ప్రస్తుతం ఈసినిమా నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో ఈమూవీని అక్టోబర్ లో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన మూవీ కావడంతో ఈమూవీ పై ప్రస్తుతానికి అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఇప్పటికే నెటితరం ప్రేక్షకుల అభిరుచిని పట్టుకోవడంలో తప్పటడుగు వేస్తున్న దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’ విషయంలో కూడ పొరపాట్లు చేశాడా అన్న సందేహాలు చరణ్ అభిమానులలో ఉన్నట్లు టాక్. దీనికితోడు రాజమౌళి దర్శకత్వంలో ఒక బ్లాక్ బాస్టర్ హిట్ లో నటించిన హీరోకు ఆ వెనువెంటనే నటించిన సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న సెంటిమెంట్ కూడ చరణ్ అభిమానులను భయపెడుతున్నట్లు తెలుస్తోంది.. .  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: