మరో సినిమా లేక.. ఆగిపోయిన మూవీనే మళ్లీ మొదలెట్టిన దిల్ రాజు?

praveen
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ వారసుల ఎంట్రీకి కొదవలేదు. ఇక నిర్మాతలు హీరోలు హీరోయిన్లు ఇక తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూనే ఉన్నారు  ఇలా పరిచయమైన వారిలో ఆశీష్ రెడ్డి కూడా ఒకరు. స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశీష్ రెడ్డి ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడైన ఆశీష్ రెడ్డి రౌడీ బాయ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాకపోయినప్పటికీ ఇక తన నటనతో మాత్రం మెప్పించగలిగాడు ఆశిష్.

 ఇకపోతే ఇప్పుడు తన రెండో చిత్రాన్ని దిల్ రాజు  సొంత సంస్థ అయిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై చేస్తున్నాడు. పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ శిష్యుడు కాశి ఇక ఈ మూవీకి దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. సెల్ఫిష్ అనే టైటిల్ ని ఈ మూవీకి ఖరారు చేశారు అన్నది తెలుస్తుంది. పాతబస్తీ నేపథ్యంలో కొనసాగే మాస్ ఎంటర్టైనర్ సినిమాగా ఈ మూవీ రూపొందుతుందట. అయితే కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఏమైందో దిల్ రాజు ఈ మూవీ ని ఆపేసాడు. ఎక్కడో తేడా కొట్టడంతో కథలో మార్పులు చేయాలని దర్శకుడికి సూచనలు చేశాడట.

 ఇక ఆ తర్వాత గ్యాప్ లో ఆశిష్ రెడ్డితో 'లవ్ మీ' అనే సినిమాను పట్టాలెక్కించగా.. ఇక ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయితే తన వారసుడి కెరియర్ను నిలబెట్టేందుకు ఇప్పటికే ఎన్నో కథలు విన్నారూ దిల్ రాజు. ఏ కథ నచ్చకపోవడంతో ఇక మళ్ళీ ఆపేసిన సినిమానే మొదలు పెట్టాలని దిల్ రాజు అనుకుంటున్నాడట. దర్శకుడు కాశి చేసిన మార్పులు నచ్చడంతో దిల్ రాజు ఇలా ఆపేసిన సినిమానే మళ్లీ పట్టాలెక్కించాడట. ప్రస్తుతం హైదరాబాదులో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది అనేది తెలుస్తుంది  తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందని ఇక ఆశీష్ రెడ్డి కెరియర్ ను నిలబెడుతుందని దిల్ రాజు బలంగా నమ్ముతున్నాడట. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: