సాయి తేజ్ కొత్త సినిమా షూటింగ్ చప్పుడు లేదేంటి..!?

Anilkumar
మెగా హీరో సాయి ధరంతేజ్ సరికొత్త సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం ఇచ్చాడు. అయితే విరూపాక్ష బ్రో వంటి సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న తేజ్ ఈ సినిమాల తరువాత చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ యంగ్ హీరో చేస్తున్న సినిమా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై  హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. డేబ్ల్యూ డైరెక్టర్

 రోహిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 120 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కావడంతో దీనికి సంబంధించిన చిన్న చిన్న విషయాలను సైతం చాలా జాగ్రత్తగా చేస్తున్నట్లుగా వినికిడి. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్స్ సైతం హైదరాబాద్ లో జరిగినట్లుగా వార్తలు వినిపించాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు దీనికి సంబంధించిన మరొక వార్త తెరపైకి వచ్చింది. తాజా టాక్ ప్రకారం తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. కథకు జీవం పోసేందుకు మేకర్స్‌ ప్రత్యేకంగా 13 భారీ సెట్స్‌ను నిర్మించారని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు కనిపించబోతున్నారు.. ఇతర నటీనటులు, తదితర వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా టైటిల్‌ ఫైనల్ కాని ఈ చిత్రాన్ని 2025 ఆగస్టులో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. దీంతో ప్రస్తుతం సాయి ధరంతేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాకి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి దీనికంటే ముందు నటించిన రెండు సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న సాయి తేజ ఈ సినిమాతో ఎటువంటి సక్సెస్ సాధిస్తాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: