మళ్లీ షురూ చేసిన కిరణ్ అబ్బవరం.. పోస్టర్ తోనే మంచి క్యూరియాసిటీ పెంచేసాడుగా..?

MADDIBOINA AJAY KUMAR
ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన రాజు వారు రాణి గారు అనే సినిమాతో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈయన ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఈ మూవీ ద్వారా ఇతనికి తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఇక అప్పటి నుండి ఈయన తెలుగు సినీ పరిశ్రమ పై దండయాత్ర చేస్తూ అనేక సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అందులో సమ్మతమే , వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలను మినహాయిస్తే ఏ సినిమాలో కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఈయన దాదాపు 2022 , 2023 సంవత్సరాలలో అనేక సినిమాలతో ప్రేక్షకులపై దండయాత్ర చేశాడు. కానీ 2024 వ సంవత్సరంలో మాత్రం ఇప్పటి వరకు ఈయన నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక తాజాగా ఈయన సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈయన నెక్స్ట్ మూవీ కి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ను జూలై 9 వ తేదీన ఉదయం 11 గంటల 01 నిమిషానికి చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ టైటిల్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ కి సంబంధించిన చాలా విషయాలు రేపే వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: