దుల్కర్ కి జోడిగా కృతి శెట్టి.. టాలీవుడ్ స్టార్ హీరో నిర్మాణంలో మూవీ.... కాంబో అదుర్స్..!

lakhmi saranya
అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్స్లో కృతి శెట్టి కూడా ఒకరు. ఉప్పెన చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ బ్యూటీ అనంతరం వరస సినిమాలలో నటించి తన సత్తా చాటింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే . దీంతో కృతి శెట్టి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది . ఇక ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో కృతి శెట్టి పెద్దగా సినిమాలు చేయడం లేదు.

తాజాగా శర్వానంతో ఓ సినిమా చేసింది కృతి శెట్టి . ఇక ఇదిలా ఉంటే తాజాగా కృతి శెట్టి పై ఓ వార్త వైరల్ అవుతుంది . మలయాల్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు . ఇక తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించాడు . ఇదిలా ఉంటే దుల్కర్ ప్రెసెంట్ లక్కీ భాస్కర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు . వెంకీ అట్లూరి డైరెక్షన్లో రూపొందుతున్న ఇందులో యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తుంది .

ఇక డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ఈ మూడు . ఇక లక్కీ భాస్కర్ ఇంకా రిలీజ్ కాకుండానే మరో సినిమాను లైన్ లో పెట్టాడు దుల్కర్ . మలయాళం దర్శకుడు సెల్వమణి డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది . ఇక ఇందులో హీరోయిన్గా యంగ్ బ్యూటీ కృతి సతిని సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది . అంతేకాకుండా ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరో రానా నిర్మించడంతో పాటు అందులో ఓ కీలక పాత్రలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: