బిజినెస్ మొదలుపెట్టిన మిస్టర్ బచ్చన్.. భారీ ధరకు అమ్ముడుపోయిన ఆడియో హక్కులు..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ కొంత కాలం క్రితం క్రాక్ మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత నుండి రవితేజ చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా ఏ సినిమా ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ ను అందించలేదు. ఆఖరుగా ఈ నటుడు ఈగల్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ సక్సెస్ సాధిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తోనే ఈమె తెలుగు తెరకు పరిచయం కానుంది. జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనుండగా , మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దానితో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ను మొదలు పెట్టింది.

తాజాగా ఈ మూవీ యొక్క ఆడియో హక్కులను భారీ ధరకు ఈ మూవీ బృందం అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క ఆడియో హక్కులను టి సిరీస్ సంస్థ దక్కించుకుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక గతంలో రవితేజ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో షాక్ , మిరపకాయ్ అనే రెండు మూవీ లు రూపొందాయి. ఇందులో మిరపకాయ్ మూవీ మంచి విజయం అందుకుంది. మిస్టర్ బచ్చన్ మూవీ వీరి కాంబోలో మూడవ సినిమా. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: