మల్లాడి వశిష్టను సైడ్ చేసిన కళ్యాణ్ రామ్.. ఆ దర్శకుడితో "బింబిసారా 2"..?

Pulgam Srinivas
నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించి , అలాగే ఎన్నో మూవీలను నిర్మించి , ఇటు హీరోగా , అటు నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను  క్రియేట్ చేసుకున్నాడు. ఇకపోతే ఈయన కెరియర్ లో కొన్ని మంచి విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. అలా కళ్యాణ్ రామ్ కెరియర్లో సూపర్ సక్సెస్ అయిన సినిమాలలో బింబిసారా మూవీ ఒకటి. ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ తోనే ఈయన దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో క్యాథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఈ సినిమా చివరలో ఈ మూవీ కి కొనసాగింపుగా బింబిసారా 2 ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక కళ్యాణ్ రామ్ మల్లాడి వశిష్ట కాంబోలో బింబిసారా విడుదల అయిన తర్వాతే దీని కొనసాగింపు మూవీ స్టార్ట్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ అలా కాలేదు. కొంత కాలానికి వశిష్ట , మెగాస్టార్ చిరంజీవి కి ఓ కథ చెప్పి ఒప్పించడం జరిగింది. దానితో ప్రస్తుతం వీరి కాంబోలో విశ్వంబర అనే సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఇకపోతే కళ్యాణ్ రామ్ వశిష్ట మధ్య క్రియేటివి డిఫరెన్స్ రావడంతో బింబిసారా మూవీ ని వేరే దర్శకుడితో రూపొందించాలి అని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం "బింబిసారా 2" మూవీ ని కళ్యాణ్ రామ్ , అనిల్ పాదూరి ని దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా అతి త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు కూడా తెలుస్తోంది.  ప్రస్తుతం కళ్యాణ్ రామ్ "NKR 21" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: