సరికొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసిన బెల్లంకొండ శ్రీను.. పోస్టర్ వైరల్..!

lakhmi saranya
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు బెల్లంకొండ శ్రీను. ఇక గత కొంతకాలం నుంచి ఈయనకి పెద్దగా కలిసి రావడం లేదు. ఈ తరుణంలోనే కొద్దిగా సినిమాలకి గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక వీటిలో భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్ర తో.. టైసన్ నాయుడు.. మూవీ కూడా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం అనంతరం తన కెరీర్ 11వ సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బయటికి వచ్చింది. దర్శకుడు కౌశిక్ రూపొందించనున్న ఈ మూవీ రేపు అనగా జూన్ 1వ తారీకు ఉదయం 10:30 కు పూజా కార్యక్రమాలతో మొదలు కానున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు. అయితే ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తే మంచి ఆసక్తికరంగా ఉంది.
ఒక కమిక్ టైప్ స్టోరీ మధ్యలో సెల్ టవర్, పైనుంచి ఒక సైతాను ఉన్నట్టుగా ఆ టవర్ దిశగా ఓ ఈగ వెళ్తున్నట్టుగా డిజైన్ చేశారు. ఇక ఇవన్నీ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లాగానే అనిపిస్తుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది. ఇక ఈ చిత్రం కి అజనీష్ లోకనాథ్ సంకీతం అందిస్తుండగా షైన్ స్క్రీ న్ మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ప్రజెంట్ ఈ మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టర్ చూసిన వారంతా.. గట్టిగానే ప్రిపేర్ అయ్యావుగా. ఈసారి పక్కా సూపర్ హిట్ కొట్టేలాగా ఉన్నావు. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీను కెరీర్ వేరే లెవెల్ లో ఉంటుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: