మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హర్యానా అందం. మొదట కొన్ని వెబ్ సిరీస్తో పాటు, సీరియల్స్లో నటించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ భామకు ప్రస్తుతం తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.ప్రజెంట్ టాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా మీనాక్షి చౌదరి కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగులో ఐదు సినిమాలు చేస్తోంది మీనాక్షి.తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది మీనాక్షి. గుంటూరుకారంలో మహేష్తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం వెంకటేష్, చిరంజీవి సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. వరుణ్తేజ్, దుల్కర్ సల్మాన్ లకు జోడీగా కనిపించబోతున్నది. చిరంజీవి విశ్వంభరలో మీనాక్షి చౌదరి ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. త్రిష మెయిన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. సీతారామం బ్లాక్బస్టర్ తర్వాత తెలుగులో దుల్కర్ సల్మాన్ చేస్తోన్న లక్కీ భాస్కర్లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. వరుణ్ తేజ్ మట్కాతో పాటు విశ్వక్సేన్ జోడీగా మరో మూవీ చేస్తోంది మీనాక్షి చౌదరి. ఈ రెండు సినిమాల షూటింగ్లు శరవేగంగా జరుగుతోన్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీలో మీనాక్షి చౌదరి ఓ హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. తెలుగులో ఐదు సినిమాలతో పాటు తమిళంలో దళపతి విజయ్ గోట్ మూవీతో ఈ ఏడాదే ప్రేక్షకులను పలకరించనుంది.ఇక మీనాక్షి చౌదరి పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. హీరోయిన్గా తెరంగేట్రం చేయకముందే ఫోటో షూట్స్తో అదరగొడుతోంది.ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ.. 2019లో హాట్ స్టార్లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.