టీచర్ కాబోయి యాక్టర్ అయిన హాట్ హీరోయిన్?

Purushottham Vinay
 సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్.. ఆ ఒక్క సినిమాతోనే యూత్ లో సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మూవీలో ఆమె భార్యగా, ప్రియురాలుగా నటించిన విధానం అయితే తెలుగు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.పక్కింటి అమ్మాయిలా సహజంగా కనిపించే రుక్మిణి సప్త సాగరాలు దాటి మూవీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఫిదా చేసింది. నాచురల్ గా నటించే ఈ బ్యూటీ అసలు అవ్వాలనుకున్న ప్రొఫెషన్ పూర్తిగా వేరట.ప్రారంభంలో థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రుక్మిణీ ఆ తర్వాత నటి కావాలి అనే ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా 2019లో ఆమె బీర్బల్ త్రైలోజి జి కేస్ 1: ఫైండింగ్ వజ్రముని అనే కన్నడ చిత్రంతో  అరంగేట్రం చేసింది. అయితే 2023లో సప్త సాగరాలు దాటి మూవీ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 


ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సౌత్ ప్రాజెక్టులకు మంచి ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉంది. వైవిద్యమైన కథలను ఇలాంటి సినిమాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అందించడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయం. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ప్రేక్షకులు ఒక అద్భుతమైన అనుభూతిని చెందుతారు. మంచి చిత్రాల ద్వారా విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందించడం చాలా ఆనందంగా ఉంది' అని రుక్మిణీ అంది.ఇంకా మాట్లాడుతూ 'నేను సినీ ఇండస్ట్రీలోకి రాకపోయినట్లయితే ఖచ్చితంగా టీచర్‌ను అయ్యేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత నా జీవితం మొత్తం కూడా మారిపోయింది. మరి ముఖ్యంగా సప్త సాగరాలు దాటి సినిమాతో గుర్తింపు వచ్చిన తర్వాత అవకాశాలు ఎక్కువ రావడం మొదలయ్యాయి. ఇతర భాషల్లో నటిస్తున్నప్పుడు కొత్త భాషలు నేర్చుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాను. భాష నేర్చుకోవడంతో పాటు అక్కడ ప్రేక్షకులకు ఎలా నచ్చుతాను అన్న విషయంపై కూడా నేను బాగా ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రేక్షకులకు నచ్చితేనే కదా నటిగా నాకు సంతృప్తి కలిగేది'అంటూ రుక్మిణి తన మనసులోని మాట బయట పెట్టింది. ప్రస్తుతం తమిళ్‌లో 'ఎస్కే 23', 'ఏస్' మూవీలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగులో రవితేజ సరసన నటించబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: