చిరు.. నాగ్ వల్ల నా సినిమాకు జనాలు లేరు... వై.వి.ఎస్ చౌదరి..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి వైవిఎస్ చౌదరి ఆఖరుగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన రేయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకు ఈ దర్శకుడు ఏ మూవీ కూడా చేయలేదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఆయన తన తదుపరి మూవీ కి సంబంధించిన వివరాలను వెల్లడించాడు.

ఆ కార్యక్రమంలో భాగంగా ఈయన వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి వివరించారు. తాజాగా ఈయన మాట్లాడుతూ ... నేను రామ్ హీరోగా ఇలియానా హీరోయిన్గా దేవదాసు సినిమాను చేశాను. ఆ సినిమా సమయంలో రామ్ కి ఎలాంటి క్రేజ్ లేదు. నేను ఆ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదల చేశాను. సంక్రాంతి సీజన్ లో పెద్దగా లవ్ స్టోరీ సినిమాలను విడుదల చేయరు.

సంక్రాంతి సీజన్ అంతా ఫ్యామిలీ సినిమాలని జనాలు ఎక్కువ చూస్తుంటారు. అయినా నేను రిస్కు చేసి ఆ మూవీ ని విడుదల చేశాను. ఇక నా మూవీ జనవరి 11.వ తేదీన విడుదల అయితే ఆ తర్వాత రోజు అనగా జనవరి 12 వ తేదీనే లారెన్స్ హీరోగా రూపొందిన స్టైల్ సినిమా విడుదల అయింది. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి , టాలీవుడ్ కింగ్ నాగార్జున గెస్ట్ పాత్రలలో నటించారు. దానితో జనాలు అంత ఆ సినిమా వైపే వెళ్ళిపోయారు. నా సినిమా వైపు జనాలు రాలేదు. ఇక ఆ తర్వాత నాలుగు వారాలు పూర్తయ్యాక నా సినిమా మెల్లమెల్లగా పుంజుకొని మంచి విజయం అందుకుంది అని వైవిఎస్ చౌదరి తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: