Namitha: ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు.. నమిత షాకింగ్ కామెంట్స్..!

lakhmi saranya
Namitha:  ఒకప్పటి ముద్దుగుమ్మ నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు అండ్ తమిళ్, కన్నడ మరియు మలయాళ వంటి భాషల్లో పలు సినిమాలు చేసి మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా 2017లో వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. అయినప్పటికీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక 2020లో మాయ మూవీ అనంతరం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది.
ఇటీవల ఇద్దరి కవలల పిల్లలకు జన్మనిచ్చింది ఈ బ్యూటీ. ఇక మళ్లీ మమత ఇటీవల ఎన్నికల ప్రచారంలో కనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది. " పెళ్లి తర్వాత 2021 లో నాకు మొదటి ప్రెగ్నెంట్ వచ్చింది. ఈ విషయాన్ని మా వాళ్లతో సంతోషంగా పంచుకున్నాను. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. నాలుగు నెలల్లోనే అబార్షన్ అయింది. దీంతో బాధను భరించలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. తర్వాత నా భర్త వల్ల బాధ నుంచి బయటికి వచ్చాను. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను.
మూడు నెలలకే ట్విన్స్ అని తెలియడంతో పూర్తిగా బెడ్కె పరిమితం అయిపోయాను. అప్పుడు నా భర్త నాకు ఆంక్షలు పెట్టేవారు. అయితే బెడ్ రెస్ట్ తీసుకోవడానికి పొట్ట కనిపించలేదు. దీంతో చాలా బాధపడిపోయాను. ఏమైందో అర్థం కాక టెన్షన్ పడ్డా. కానీ ఏడు నెలల తర్వాత నా కొడుకు పెరిగింది. దీంతో ఊపిరి పీల్చుకున్నాను. ఇద్దరి ట్విన్స్  పుట్టి నా జీవితంలోకి వెలుగులు తెచ్చారు " అంటూ చెప్పుకొచ్చింది నమిత. ప్రజెంట్ ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చూసిన వారంతా..." ఒకదాన్ని దూరం చేస్తే దేవుడు ఇంకోటి ఇస్తాడు అనేదానికి మీరే నిదర్శనం. మీ జీవితంలో కూడా ఇదే జరిగింది " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: