మాటల మాంత్రికుడు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్..!!

murali krishna
ఉస్తాద్ రామ్ పోతినేని సైలెంట్ గా కొత్త సినిమా మొదలెట్టేసారు. మైత్రీ మూవీస్ వారు భారీగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మాటల మాంత్రికుడైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఏమీ మాట్లాడటంలేదు. ఎందుకంటే గుంటూరు కారం సినిమా పరాజయానికి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా గుంటూరు కారంకు కూడా రివ్యూ ఇచ్చారు. ఇది మహేష్ బాబు స్థాయి సినిమా కాదని, దర్శకుడుగా త్రివిక్రమ్ తర్వాతైనా మంచి కథతో రావాలనుకుంటున్నానని, సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకోవడంవల్ల కథలో మార్పులు వచ్చి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.టాలీవుడ్ హీరో రామ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తను...టాలీవుడ్ హీరో రామ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తను అటు త్రివిక్రమ్ కానీ, ఇటు రామ్ కానీ ఎక్కడ చెప్పలేదు. దీంతో వారి ఇద్దరి సినిమా పట్టాలెక్కుతుందని ఎవరూ అనుకోలేదు. కాకపోతే త్రివిక్రమ్, రామ్ మధ్య కథా పరమైన చర్చలు జరిగాయని ఫిలిం నగర్ గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు హీరో రామ్ మాటల మాంత్రికుడితో సినిమా ఉంటుందని ప్రకటించాడు.సంక్రాంతికి రామ్ కథానాయకుడిగా, కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన రెడ్‌ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రామ్‌ పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. దానిలో భాగంగా రాబోయే సినిమాల గురించి సైతం తెలిపాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా గురించి ప్రస్తావించారు. త్రివిక్రమ్‌తో గతంలో మాట్లాడానని, మా ఇద్దరి కలయికలో తర్వాత సినిమా ఉంటుందని ప్రకటించారు. అయితే అది ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం అని రామ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: