టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు.కథానాయిక గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు వరలక్ష్మీ శరతకుమార్. టాలీవుడ్లో బలమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. ఈ మధ్యకాలంతో తెలుగు సినిమాలతో మరింత బిజీ అయ్యారు.ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ప్రియుడు నికోలరు సచ్దేవ్తో ఏడడుగులు వేయబోతోంది. మార్చిలో వీరి నిశ్చితార్థం జరిగింది. జూలై 2న థారుల్యాండ్లో పెళ్లి జరగనుంది..నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇంట పెళ్లి సందడి షురూ అయ్యింది.ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి పై కొన్ని ఆసక్తికర విషయాలు పెళ్లి పనులు హడావుడి గురించి షేర్ చేసుకుంది. కుటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లింది వరలక్ష్మి.కుటుంబ సమేతంగా పెళ్లిక రావాలని తలైవాను ఆహ్వానించిందివరలక్ష్మి వెంట రాధిక, ఆర్ శరత్ కుమార్ లు కూడా ఉన్నారు. ఈ మేరకు రజనీకాంత్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ కాబోయే పెళ్లి కూతురు.' తలైవా సర్ను, లతా ఆంటీని కలిసి మా పెళ్లికి ఆహ్వానించాను. నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నందుకు థాంక్యూ సర్. ఐశ్వర్య రజనీకాంత్.. నువ్వెప్పటిలాగే ఎంతో ప్రేమగా మాట్లాడావు' అని రాసుకొచ్చింది వరలక్ష్మిఈ ఫోటోల్లో రజనీకాంత్ దంపతు లతో పాటు వరలక్ష్మి తల్లిదండ్రులు రాధిక- శరత్కుమార్ ఉన్నారు. కాగా ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో మార్చిలో నిశ్చితార్థం చేసుకుంది వరలక్ష్మి.జూలై 2న థాయ్ల్యాండ్ వేదికగా వరలక్ష్మి- నికోలయ్ సచ్ దేవ్ తో పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.తెలుగులో నాలి రామకృష్ణ ఎల్ఎల్బీ, జాంబి రెడ్డి, నాంది, యశోద, వీరసింహా రెడ్డి, మైఖేల్ చిత్రాల్లో నటించింది వరలక్ష్మి. ఇటీవలే హనుమాన్ తో బ్లాక్బస్టర్ అందుకుంది.