బాలకృష్ణ నాకు మంచి స్నేహితుడు... అంజలి..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటి మనులలో ఒకరు అయినటువంటి అంజలి తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ రోజు థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఓ రెండు రోజుల క్రితం ఈ మూవీ బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది.

ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా స్టేజ్ పైకి ఎక్కిన బాలకృష్ణ అప్పటికే స్టేజి పై ఉన్న అంజలి నీ చేయితో తోసేసాడు. దానితో ఈవెంట్ లో ఉన్న వారితో పాటు , ఆ ఈవెంట్ ను చూస్తున్న జనాలు కూడా ఒక్క సారిగా షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత వారిద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. ఈవెంట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత బాలకృష్ణ , అంజలి ని తోచిన వీడియో వైరల్ అయింది.

దానితో అనేక మంది అనేక రకాలు అయిన కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇకపోతే తాజాగా అంజలి , బాలకృష్ణ గురించి స్పందించింది. తాజాగా అంజలి మాట్లాడుతూ ... బాలకృష్ణ , నేను చాలా సంవత్సరాలుగా మంచి స్నేహితులం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రీ  రిలీజ్ ఈవెంట్ కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. ఆయనతో మళ్ళీ వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది అని ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చింది. ఇకపోతే గతంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన డిక్టేటర్ మూవీ లో అంజలి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: