ఆ సినిమా నుండి తప్పుకోవాలని అనిపించింది... జాన్వి కపూర్..!

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటిమని జాన్వి కపూర్ తాజాగా మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి అనే మూవీలో నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. అందులో భాగంగా ఈ బ్యూటీ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడుతూ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజాగా జాన్వి మాట్లాడుతూ ... చాలా కాలం క్రితమే ఈ సినిమా యొక్క కథను విన్నాను. అది అద్భుతంగా నచ్చటంతో మీలి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ మూవీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను.

ఇక ఇందుకు సంబంధించిన శిక్షణ తీసుకోవడానికి మొత్తం నాకు రెండు సంవత్సరాల సమయం పట్టింది. ఈ రెండు సంవత్సరాలలో కోచ్ లు నన్ను పూర్తిగా క్రికెటర్ గా మార్చడానికి ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు ఎన్నో గాయాలు అయ్యాయి. ఓ దశలో అయితే, నా రెండు భుజాలు పనిచెయ్యవేమో అనుకున్నాను. అలాంటి టైమ్ లో ఎన్నో సార్లు ఈ సినిమా నుంచి నేను వైదొలగాలని భావించాను. కానీ, ఈ యూనిట్ నాకు ధైర్యం చెప్పారు. నన్ను ముందుకు నడిపారు’ అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

మరి ఈ సినిమా కోసం చాన్వి ఎంతో కష్టపడినట్టు చెప్పుకొచ్చింది. మరి ఈ మూవీ ఈ బ్యూటీకి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఉన్న ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jk

సంబంధిత వార్తలు: