19 ఏళ్లు పూర్తి చేసుకున్న మాస్ మహారాజా బ్లాక్ బస్టర్ మూవీ..!!

murali krishna
మాస్ మాహారాజా రవితేజ 1991లోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ.. తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు.ఇక ఇటీవల 'ఈగల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు ఓకే చేసే పనిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. రవితేజ సినీ చరిత్రలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాల్లో 'భద్ర' ఒకటి.మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ 'భద్ర'..ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించారు.ఈ చిత్రంతోనే బోయపాటి దర్శకుడిగా పరిచయం అయ్యారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.బోయపాటి తెరకెక్కించిన సినిమాలలో 'భద్ర' మూవీ ది బెస్ట్ గా నిలుస్తుంది.ఈ చిత్రంలో మీరా జాస్మిన్‌ రవితేజ సరసన హీరోయిన్‌గా నటించింది.దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌,బ్రహ్మాజీ,ఈశ్వరి రావ్‌ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఫ్యాక్షన్‌ బ్రాక్‌డ్యాప్‌ కథకు ఎమోషనల్‌ లవ్‌ స్టోరీని జత చేసి దర్శకుడు బోయపాటి భద్ర సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించారు. ఈ చిత్రం మే 12 2005 న గ్రాండ్ గా రిలీజ్ అయి సంచలన విజయం సాధిచింది..భద్ర సినిమాతో రవితేజకు మాస్ హీరోగా మరింత గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది.ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు.ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై నేటికీ 19 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీని గుర్తు చేసుకుంటూ చిత్రబృందం ప్రత్యేక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఎస్వీసీ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మే 12న విడుదలై సంచలన విజయం సాధిచింది. అప్పటివరకు రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్‌ను ఈ చిత్రం ఆమాంతం పెంచేసింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అయితే ఒక రేంజ్ లో హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: