చైతూ... కార్తీక్ దండు కాంబో మూవీ రిలీజ్ అప్పుడే..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండెల్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత చైతన్య , కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి మేకర్స్ పూజా హెగ్డే ను సంప్రదించగా కథ మొత్తం విని ఈ మూవీ లో నటించడానికి ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగం అందుకోబోతున్నట్లు సమాచారం.

కొంత కాలం క్రితం విరూపాక్ష అనే మూవీకి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దానితో ఈ దర్శకుడు చైతు తో మరింత గ్రాండ్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా యొక్క షూటింగ్ కి ఎక్కువ కాలం పట్టబోతున్నట్లు దానితో చైతు , కార్తిక్ కాంబో మూవీని 2026 వ సంవత్సరంలో విడుదల చేయడానికి ప్లాంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ  మూవీ ని నిర్మించనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: