మంచు హీరోకి రీ ఎంట్రీ కలిసోచ్చేనా..?

murali krishna
టాలీవుడ్ యంగ్ యాక్టర్ మంచు మనోజ్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు.దాదాపు ఏడేళ్లుగా ఆయన మూవీస్‌కి దూరంగా ఉంటున్నారు. వరుస పరాజయాలు, వ్యక్తిగత లైఫ్‌ డిస్టర్బ్ కావడంతో మంచు మనోజ్‌ సినిమాలు మానేశాడు.ఇటీవలే భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న మనోజ్ ప్రస్తుతం వ్యక్తిగత లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మంచు మనోజ్‌ని వివాహం చేసుకున్నాక మరోసారి ఆమె తల్లి అయ్యింది. ఇటీవల కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభించారు మనోజ్‌. ఆయన ఆ మధ్య ఉస్తాద్‌ అనే షో చేశాడు. ఈ సెలబ్రిటీ టాక్‌ షో పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.యంగ్ హీరో తేజసజ్జా  ఇటీవల పాన్ ఇండియా అడ్వెంచరస్‌ మూవీ' మిరాయి'అనే టైటిల్‌తో రాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెల్సింది.ఈ మూవీ టైటిల్‌కు సంబంధించిన గ్లింప్స్‌కు  మంచి స్పందన లభించింది.
కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికానాయక్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో మంచు మనోజ్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. కొన్ని రోజులుగా తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వకుండా సస్పెన్స్‌లో పెట్టిన మంచు మనోజ్‌ తాజాగా షూట్‌లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఓ ఫొటో విడుదల చేసి హింట్‌ ఇచ్చేశాడు. మళ్లీ సెట్‌లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.అయితే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, నటుడు ఇటీవలే మిరాయ్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు . ఇదే విషయాన్ని పరోక్షంగా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో ప్రకటించారు . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. గౌర హరి ఈ మూవీ కి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 18, 2025న 7 భాషల్లో మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: