కార్తీక : ఓటీటీలోకి వచ్చేస్తున్న కాజల్ హారర్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

murali krishna
కలువ కళ్ళ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. వరుస సక్సెస్ లతో దూకుడు మీద వున్న కాజల్ వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కాజల్ వరుస సినిమాల్తో బిజీ గా మారింది..కాజల్ రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ హారర్ మూవీ కరుంగా పియం. కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన ఈ మూవీలో రైజా విల్సన్‌, యోగిబాబు మరియు జనని తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.గతేడాది మే 19న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత కార్తీక పేరుతో తెలుగులో కూడా రిలీజై మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే ఒరిజెనల్ వెర్షన్ కరుంగా పియం ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఇప్పుడు ఈ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు  వెర్సన్ ఆడియెన్స్ ను భయపెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ఆహాలో కార్తీక మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.. ఏప్రిల్ 9 నుంచి ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కు సంబంధించిన ఒక కొత్త వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మూవీ కథ విషయానికొస్తే.. కార్తీక (రెజీనా) సరదాగా ఓ ఓల్డ్‌ లైబ్రరీకి వెళుతుంది .అక్కడ వందేళ్ల క్రితం నాటి 'కాటుక బొట్టు' అనే పుస్తకం కనిపిస్తుంది. వెంటనే ఆ బుక్ ను చదవడం ప్రారంభిస్తుంది. అయితే ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ కూడా దెయ్యాలుగా మారి తన ముందుకు వస్తుంటాయి. అందులో కాజల్‌ (కార్తిక) కూడా ఉంటుంది. పగ తీర్చుకోవాలని కాజల్ దెయ్యంగా మారుతుంది.అస్సలు కాజల్‌ ఎలా చనిపోయింది. తన పగను ఎలా తీర్చుకుంది.. అనేది ఈ మూవీ కథ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: