మెగాస్టార్ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన సిద్దు జొన్నలగడ్డ..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ బాయ్ గా దూసుకుపోతున్న సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం  దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. dj టిల్లు సినిమాతో యూత్ ను ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో మరొకసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఊహించిన విధంగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. కృష్ణ అండ్ హిస్ లీలా మా వింత గాదా వంటి సినిమాలతో '

ఆ తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 2022లో డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోల లిస్ట్ లొకి చేరిపోయాడు ఈ యంగ్ హీరో. తెలంగాణ యాసలో ఆయన మాట్లాడే మాటలు డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. అంతేకాదు ఈ సినిమాను అతను ఒక్కడే తన భుజాల పై నడిపించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఇప్పుడు ఆ సినిమాకి కొనసాగింపు గా టిల్లు స్క్వేర్ సినిమాతో మళ్ళీ ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా

 బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. మునుపెన్నడూ కనిపించాలని గ్లామరస్ రోల్ లో కనిపించి మెప్పించింది అనుపమ. ఇదిలా ఉంటే సిద్దు గురించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్ తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్దు మాట్లాడుతూ దీని పై స్పందించారు. మెగాస్టార్ తో చేస్తే అది తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని అన్నాడు సిద్దు. గతంలో చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. మళ్లీ ఆ అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నా.. మేము ఎప్పుడైనా కలిసిన దాని గురించే మాట్లాడుకుంటాం.. ఆయన ఓ సూపర్ హ్యూమన్. ఇండస్ట్రీ అంటే ముందు గుర్తుకొచ్చేది మెగాస్టారే అని అన్నాడు సిద్దు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: