ఆ సినిమా ఒప్పుకున్నాక.. అందరూ నన్ను వేశ్య అన్నారు : హీరోయిన్

praveen
టాలీవుడ్ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇక ఆ తర్వాత బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న హీరోయిన్లు ఎన్నో నేటి రోజుల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో కొంతమందికి బాలీవుడ్ లో కాలం కలిసి వచ్చి వరుసగా అవకాశాలు అందుకుంటే ఇంకొంద మంది మాత్రం అక్కడ క్లిక్ అవ్వలేక ఇక్కడ అవకాశాలు లేక తెగ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక బాలీవుడ్లో ఎన్నో వైవిద్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఆదాశర్మ. టాలీవుడ్ లో పూరి జగన్నాధ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ మూవీతో హీరోయిన్గా పరిచయమైంది అన్న విషయం తెలిసిందే.

 మొదటి సినిమాలోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించినప్పటికీ ఎందుకో ఈ హీరోయిన్ కు తగిన గుర్తింపు మాత్రం రాలేదు. ఇక ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే అక్కడ వరుసగా అవకాశాలు అందుకుంటుంది అని చెప్పాలి. ఎన్నో వివాదాస్పద సినిమాలు చేసేందుకు కూడా ఎక్కడ వెనకడుగు వేయడం లేదు ఆదాశర్మ. ఆదాశర్మ  నటించిన కేరళ ఫైల్స్ సినిమా ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 అయితే ఇక ఇటీవలే ఒక సినిమాను అంగీకరించినందుకు ఏకంగా సోషల్ మీడియాలో తనను ప్రాస్టిట్యూట్ అంటూ విపరీతంగా ట్రోల్ చేశారు అని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. బస్తర్ సినిమాను అంగీకరించినందుకు తనను సోషల్ మీడియాలో వేశ్య అంటూ ట్రోల్ చేశారు అంటూ వాపోయింది. తాను ఏ పోస్ట్ పెట్టినా.. దానికి కామెంట్స్ మాత్రం నెగిటివ్ గానే ఉండేవి అంటూ వెల్లడించింది. తాను పువ్వుల ఫోటో పెట్టిన కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారని.. కేరళ ఫైల్స్ సమయంలో కూడా ఇలాంటి అవమానాలను ఎదుర్కొన్నాడు అంటూ ఆదాశర్మ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: