నాకు అది చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన సాయి పల్లవి?

praveen
సినిమా ఇండస్ట్రీ అనే మాయా ప్రపంచంలో ఇక హీరోయిన్లుగా నిలదొక్కుకోవాలి అంటే అందాల ఆరబోత చేయాల్సిందే అనే ఒక భావన ప్రతి ఒక్కరిలో ఉండేది. అయితే ఇలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందాల ఆరబోతు చేస్తూ ఇక ప్రేక్షకులను అలరించడం లాంటివి చేస్తూ ఉండేవారు. చిట్టి పొట్టి బట్టలు వేస్తూ కొంతమంది అయితే మితిమీరిన క్వివేజ్ షో చేయడం కూడా ఎన్నోసార్లు చూశాం. కానీ అందాల ఆరబోత కాదు టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన హీరోయిన్లు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి మొదటి వరుసలో ఉంటారు అని చెప్పాలి.

 ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతూ ఉన్నారు సాయి పల్లవి. ఇప్పటివరకు ఆమె చేసింది కొన్ని సినిమాలు మాత్రమే. కానీ ఆ కొన్ని సినిమాలలోనే తన పాత్రలతో ప్రేక్షకుల మధ్యలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ హీరోయిన్. అందాల ఆరబోతకు ఎక్కడ తావు లేకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ కెరియర్ ని కొనసాగిస్తుంది. కోట్లు ఇస్తానన్న రొమాంటిక్ రోల్స్ చేయను అంటూ తెగేసి చెప్పేస్తూ ఉంది. ఇలా అందాల ఆరబోత చేయకపోయినా సాయి పల్లవి వరుసగా అవకాశాలు అందుకుంటూ ఉండటం గమనార్హం.

 అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన భవిష్యత్తు కోరిక ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. మనసులో మాట బయట పెట్టేసింది. ఏకంగా తనకు దర్శకత్వం చేయాలని కోరిక ఉంది అంటూ సాయి పల్లవి తెలిపింది. తన అభిరుచికి తగ్గట్టుగా ఒక కథను రెడీ చేస్తుందట ఈ హీరోయిన్. అయితే అది ప్రస్తుతం ఆలోచన మాత్రమేనని ఇక సినిమాకు నిర్మాతలు ఎవరో కూడా తెలియదని.. తెలిశాక అందరికీ చెబుతాను అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండాలు మూవీలో నటించడంతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు నటిస్తున్న మరో సినిమాలో నటిస్తూ బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చినందుకు సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: