జూన్‌లో విడుదల కానున్న రామ్ డబుల్ ఇస్మార్ట్...!!!

murali krishna
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా సినిమా ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా ఏళ్లు అవుతున్న కూడా క్రేజ్ తగ్గలేదు.'ఇస్మార్ట్‌ శంకర్' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రామ్.. మరోసారి పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో 'డబుల్ ఇస్మార్ట్' మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.వాస్తవానికి ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ దాటినా టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌పై రామ్ క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్‌గా ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న రామ్.. 'డబుల్ ఇస్మార్ట్' జూన్‌లో విడుదల కానుందని చెప్పాడు. అప్పటికి ఎలక్షన్ హడావుడి అంతా పూర్తవుతుంది కనుక అప్పుడు రావడమే కరెక్ట్‌ అని మేకర్స్ భావిస్తున్నారట. పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల పని అంతా పూర్తయినట్టు తెలుస్తోంది. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్‌తోపాటు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.ఈ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కినప్పటికీ.. ప్రస్తుతం మళ్ళీ ప్లాప్స్ లోనే ఉన్నారు. దీంతో మళ్ళీ ఒక మంచి కమ్‌బ్యాక్ అందుకోవడం కోసం వీరిద్దరూ చేతులు కలిపారు. తమకి బూస్ట్ ఇచ్చిన సినిమానే నమ్ముకొని సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు.
'డబల్ ఇస్మార్ట్' అంటూ సీక్వెల్ ని ప్రకటించి షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు. ఈ మార్చిలోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మరికొంత షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలన్స్ ఉండడంతో మార్చి నుంచి వాయిదా వేశారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు. అసలు ఏప్రిల్ నుంచి ఇతర సినిమాలు డేట్స్ లాక్ చేసుకొని ఉండడమే కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలహడావుడి కూడా ఉంది.దీంతో ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందని రామ్ ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందుతున్నారు. ఇక ఫ్యాన్స్ పడుతున్న ఈ టెన్షన్ ని తగ్గించడం కోసం రామ్.. రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ ఇచ్చేశారు. జూన్ లో ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు రామ్ తెలియజేసారు. ఆ టైంకి ఎన్నికల హడావుడి అంతా కూడా ముగిసిపోతుందని, జూన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ రామ్ తెలియజేశారు.సమ్మర్ హాలిడేస్ అయిపోయే టైంకి వచ్చి థియేటర్స్ లో ఇంకో భారీ హిట్ కొట్టడానికి రామ్, పూరి ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఇస్మార్ట్ శంకర్ కూడా ఇదే సమయంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుని అందుకుంది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ని కూడా ఆ కలిసొచ్చిన సమయానికే తీసుకు రావాలని పూరి, రామ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. జూన్ 14న రిలీజ్ కి డేట్ అనుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: