కంటి నిండా నిద్రపోయి చాలా రోజులు అవుతుంది.. మ్రుణాల్ కామెంట్స్ వైరల్..!?

Anilkumar
ఇప్పటికీ బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు చాలా సినిమాల్లో నటించి తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మరింత క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కానీ అలా వచ్చిన వారందరూ కి టాలీవుడ్ లో అవకాశాలు రావడం కష్టమే అని చెప్పాలి. దాంతో తిరిగి మళ్ళీ బాలీవుడ్ కి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క బ్యూటీ మాత్రం సినిమాల విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు మ్రునాల్ ఠాగూర్ సీతారామం

 సినిమా తో హాలీవుడ్ నుండి టాలివుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ బ్యూటీ. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది అని చెప్పొచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మకి తెలుగులో వారి అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమాలో మృనాల్ హీరోయిన్ పాత్రలో మెప్పించింది. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతోంది.

నేను కంటినిండా నిద్రపోయి చాలా రోజులు అయ్యింది అంటుంది మృణాల్. అసలు విషయం ఏంటంటే మృణాల్ ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. ఆమె మాట్లాడుతూ.. వరుస షూటింగ్స్ తో బిజీగా మారిపోయాను. దాదాపు రెండేళ్లుగా బిజీగా గడుపుతున్నా.. ఎంత బిజీగా ఉన్న చిన్న చిన్న విరామాలు, ఫ్యామిలీతో గడిపే క్షణాలు చాలా అవసరం అని తెలిపింది మృణాల్. అందుకే ఇప్పుడు షూటింగ్ నుంచి విరామం తీసుకొని కుటుంబంతో సమయం గడుపుతున్నా అని తెలిపింది.  నాని హీరోగా నటించిన హాయ్ నాన్న లో నటించింది మృణాల్. ఈ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. హాయ్ నాన్న లో నానితో పోటీ పడి మరీ నటించింది మృణాల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: