ప్రస్తుతం
రాజమౌళి పేరు తెలియని అభిమాని ఉండరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతలా ఆయన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు ఆయన. ప్రపంచ సినీ అభిమానులు మనసులను దోచుకున్నడు రాజమౌళి. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాతో
హాలీవుడ్ ను కూడా షేక్ చేశాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో
ఆస్కార్ కూడా ఇండియాకు తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఈ
సినిమా జపాన్లో స్క్రీనింగ్ అవుతోంది. కాగా ఈ సందర్భంగా రాజమౌళికి కూడా అక్కడికి స్పెషల్ ఆహ్వానం దక్కింది. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లిన
రాజమౌళి మహేష్ బాబుతో
సినిమాపై ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. దీంతో ఇప్పుడు
రాజమౌళి చేసినప్పుడు కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న
రాజమౌళి SSMB29 మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నాడు.
జక్కన్న మాట్లాడుతూ..'నా నెక్ట్స్ చిత్రానికి సంబంధించి రైటింగ్ వర్క్ పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీకి హీరోని కూడా లాక్ చేశాం. అతని పేరు మహేష్ బాబు. అతడు చాలా అందంగా ఉంటాడు. మీక్కూడ తెలుసు. ఈ చిత్రాన్ని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను.
మూవీ రిలీజ్ అయిన తర్వాత అతడిని ఇక్కడికి తీసుకొస్తాను' అని చెప్పుకొచ్చాడు జక్కన్న. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారడంతో.. ఇటు మహేష్ ఫ్యాన్స్, అటు
రాజమౌళి అభిమానులు సంతోషపడుతున్నారు. SSMB29..
టాలీవుడ్ తో పాటుగా
ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్
రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన
మూవీ ఇది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోందన్న వార్తలు ఇప్పటికే వైరల్ గా మారాయి. జంగిల్ అడ్వెంచరల్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ను స్వయంగా
రాజమౌళి ఇచ్చాడు.