ఎన్నాళ్లయింది బ్రో.. దేవిశ్రీ గొంతు విని.. అదరగొట్టేసాడు?

praveen
మాస్ యాక్షన్ హీరోగా కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విశాల్.. ఇక నేటి రోజుల్లో ట్రెండుకు తగ్గట్లుగా డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. రొటీన్ స్టోరీస్ ని కాకుండా విభిన్నమైన స్టోరీస్ ని ఎంచుకుంటూ.. ఇక ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఇలాంటి ప్రయోగాలను చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రత్నం అనే సినిమాలో నటిస్తున్నాడు విశాల్. హరి డైరెక్షన్లో తెరక్కుతున్న ఏ మూవీని కార్తికేయన్ రూపొందిస్తున్నారు.

 ఇక ఈ మూవీలో విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల టైటిల్ తో పాటు ఫస్ట్ షార్ట్ టీజర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేయగా ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇదివరకు ఎప్పుడూ కూడా విశాల్ ను చూడని కొత్త లుక్ లో ప్రేక్షకులను సర్ ప్రైస్ చేశాడు ఈ యాక్షన్ హీరో. దీంతో ప్రేక్షకులందరిలో కూడా ఈ ఫస్ట్ లుక్ భారీగా అంచనాలను పెంచేసింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఈ సినిమాలోని ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. డోంట్ వర్రీ.. డోంట్ వర్రీ రా చిచ్చా అంటూ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 అయితే ఇక ఈ సాంగ్ మాత్రం అటు తెలుగు మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా ఎంతో స్పెషల్ గా మారింది అని చెప్పాలి. ఎందుకంటే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ చాలా రోజుల తర్వాత తన గొంతుకి సానపెట్టారు. ఇక మరోసారి సాంగ్ పాడి ప్రేక్షకులకు సర్ ప్రైస్ చేశాడు. ఇక దేవి శ్రీ గాత్రంతో వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులందరికీ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. చిన్నతనం నుంచి హీరో పెరిగిన విధానం సాంగ్ రూపంలో వివరించాడు దేవి శ్రీ. ఇక ఈ పాటలో దేవిశ్రీ రైమింగ్ అయితే ప్రేక్షకులందరికీ కూడా తెగ ఆకట్టుకుంటుంది. దీంతో ఇక ఈ పాట విన్న తర్వాత ఎన్నాళ్లయింది బ్రో దేవిశ్రీ గొంతు విని.. అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: