హిజాబ్ ధరిస్తూ షాక్ ఇచ్చిన ఐటమ్ గర్ల్..!!

murali krishna
తెలుగు సినీ పరిశ్రమలో స్పెషల్ సాంగ్స్‏కు ఈ బ్యూటీ కేరాఫ్ అడ్రస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ నటించింది తక్కువ లే అయినా ఎంతో మంది అభిమానలను సంపాదించుకుంది.అందం, అభినయం, గ్లామర్ క్వీన్‏గా అలరించినా… ఈ భామకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా.. స్పెషల్ సాంగ్స్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో పలు ల్లో కనిపించిన ఈ తార చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. లకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతూ.. ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఈ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా హిజాబ్ ధరించి కనిపిస్తుంది. ఇక ఇందుకు గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.. తనే ముంతాజ్. ఈ పేరుతో గుర్తుపట్టడం కష్టమే. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓ సూపర్ హిట్ లో స్టెప్పులేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. భూమిక కాంబోలో వచ్చిన ఖుషీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో 'గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో… వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో.. ' అంటూ వచ్చే స్పెషల్ సాంగ్‏లో పవన్ తో కలిసి స్టెప్పులేసింది. ఈ తోనే తెలుగు తెరకు పరిచయమైంది ముంతాజ్. ఆ తర్వాత చాలా బాగుంది, లూటీ, చాక్లెట్, జెమిని, ధీరుడు, ఆగడు వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో కనిపించి మెప్పించింది. ఇక చాలా కాలం పాటు లకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. పవన్ నటించిచన అత్తారింటికి దారేది లో ఇట్స్ టైమ్ టూ పార్టీ పాటలో కనిపించింది.ఇక కొన్నాళ్లు లకు దూరమైన ఈ హీరోయిన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆకస్మాత్తుగా లకు గుడ్ బై చెప్పడంపై స్పందించింది ముంతాజ్. 'నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నాకు ఖురాన్ బాగా తెలుసు. మొదట్లో ఖురాన్‌లో పేర్కొన్న విషయాలకు అర్థం తెలియదు . ఒకానొక దశలో దాని అంతరార్థం నాకు అర్థమై నాలో మార్పు వచ్చింది. అందుకే ఇకపై చేయకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: