పెళ్లి కంటే.. మా పిల్లలు లేచిపోతనే బెటర్ అంటున్న బాలీవుడ్ నటి?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా కెమెరాలు ఒక గంట కని పెడుతూనే ఉంటాయి. అందుకే సెలబ్రిటీలకు సంబంధించి ఏదో ఒక విషయం ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక తమ ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా విషయాలను ఇక సెలబ్రిటీలు అభిమానులతో పంచుకుంటే అది ఇంటర్నెట్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.

 అయితే ఇక ఇటీవల ఒక బాలీవుడ్ సెలబ్రిటీ ఏకంగా తన పిల్లల గురించి చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయ్. సాధారణంగా సినీ సెలబ్రిటీలు అన్న తర్వాత కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. దీంతో ఇక పిల్లల పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు అరేంజ్డ్ మ్యారేజ్ లు చేస్తూ ఉంటే ఇంకొన్నిసార్లు మాత్రం పిల్లలకి లవ్ మ్యారేజ్ లు చేయడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక్కడ మాత్రం ఒక బాలీవుడ్ సెలబ్రిటీ తన పిల్లలు ఏకంగా  లేచిపోవడమే ఎంతో బెటర్ అంటూ చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి.

 ఇలాంటి కామెంట్స్ చేసింది ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ కన్నా. తమ పిల్లలు పెళ్లి చేసుకోవడం కంటే లేచిపోవడమే బెటర్ అంటూ కామెంట్స్ చేసింది. అంబానీ ఇంట పెళ్లి వేడుక తర్వాత పెళ్లి సెలబ్రేషన్స్ ప్రమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయ్. నేను నీత అంబానీ లాగా డాన్సులు చేయలేను. చివరగా డాన్స్ ట్రై చేసి చివరిది కాలు విరగొట్టుకున్నాను. ఇక నా భర్త అక్షయ్ కుమార్ రాత్రి పది గంటల తర్వాత అస్సలు మేలుకొని ఉండలేడు. అందుకే నేను హ్యాపీగా ఉండాలని నా పిల్లలు అనుకుంటే ఇలా పెళ్లి చేసుకోవడం కంటే లేచిపోవడమే బెటర్ అంటూ ట్వింకిల్ కన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: