అంబానీజీ.. నన్ను కూడా కొనుక్కుంటే సరిపోయేదిగా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?
బడాబడా హీరోలు సైతం ఈవెంట్లో కాలు కలిపి డాన్సులు చేశారు. విదేశాల నుంచి వచ్చిన సెలబ్రిటీలు సైతం స్పెషల్ పెర్ఫార్మెన్సులతో అదరగొట్టేశారు. ఇక వేల కోట్లు ఖర్చుపెట్టి మరి ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించాడు ముఖేష్ అంబానీ. మార్చ్ ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక గురించి ఇప్పటికి కూడా ఇండియాలో అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఏకంగా పెళ్లికి అతిథులుగా వెళ్లడం మానేసి ఏకంగా పారితోషికం తీసుకొని ఈవెంట్లో కొంతమంది సెలబ్రిటీలు డాన్సులు చేయడంపై.. అటు విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి.
తాను మాత్రం అలాంటి పని చేయను. నాకు గౌరవమే ముఖ్యం అంటూ బాలీవుడ్ లోని ముగ్గురు ఖాన్స్ ని ఇండైరెక్టుగా ప్రస్తావిస్తూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారిపోయాయ్. ఇక ఇప్పుడు ఇదే విషయంపై నటి రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంబానీజి.. రిహానాకు కోట్ల రూపాయలు ఇచ్చిన ఆమె చిరిగిన బట్టలతో వచ్చింది. నాకు 10 కోట్లు ఇచ్చి ఉంటే మీకు ఎన్నో ప్రయోజనాలు ఉండేవి. అనంత్ బాగా బరువు పెరిగారు. ఒకవేళ నా దగ్గరికి వచ్చి ఉంటే ఐదు రోజుల్లోనే బరువు తగ్గేలా చేసేదాన్ని.. నన్ను కూడా కొనుక్కోండి.. నా సేవలను వాడుకోండి అంటూ రాఖీసావంత్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.