శ్రీదేవి ఫోటోలో వున్న ఆ స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!
శ్రీదేవి కుడివైపు కూర్చున్న అమ్మాయి నగ్మా.. అలాగే ఆమెకు ఎడమవైపు కూర్చున్న అమ్మాయి జ్యోతిక. అలాగే తన పక్కన కూర్చున్న చిన్నారి రోషిణి. వీరంతా మెగాస్టా్ర్ చిరంజీవి సరసన నటించి అలరించారు. చిరంజీవి జోడిగా ఘరానా మొగుడు లో నటించింది నగ్మా. ఆ తర్వాత రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు చిత్రాల్లో కలిసి నటించారు. నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇక ఆ తర్వాత జ్యోతిక, చిరంజీవి కాంబోలో ఠాగూర్ వచ్చింది. ఇక రోషిణి, చిరంజీవి జంటగా మాస్టర్ లో నటించారు. మొత్తం ముగ్గురు అక్కాచెల్లెళ్లు మెగాస్టార్ చిరంజీవి జోడిగా నటించినవారే. ఇక శ్రీదేవి, చిరంజీవి కాంబోలో అనేక సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అందులో జగదేకవీరుడు అతిలోక సుందరి ఒకటి. ఆ తర్వాత ఎస్పీ పరశురాం, కొండవీటి రాజా తదితర చిత్రాల్లో నటించింది.నగ్మా డిసెంబర్ 25, 1974న అంటే క్రిస్మస్ రోజున జన్మించింది. ఆమె తల్లి ముస్లిం తండ్రి హిందూ. నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. అతను సుప్రసిద్ధ వ్యాపారవేత్త. నగ్మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తల్లి సినీ నిర్మాత చందర్ సదనను వివాహం చేసుకుంది. వీరికి జ్యోతిక, రోషిణి జన్మించారు. నగ్మా ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో సహా 50కి పైగా చిత్రాల్లో నటించింది.