లావణ్య తో పెళ్లి పై షాకింగ్ కామెంట్ చేసిన వరుణ్ తేజ్..!?

Anilkumar
నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన తోటి నటి లావణ్యను ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్, గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ఉన్నారు. అందులో భాగంగా జూన్‌ 09న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. నవంబర్ 01న వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. ఈ జంట దాదాపుగా ఆరేళ్ల పాటు ప్రేమించుకుని..  పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుక అంగరంగ వైభంగా జరిగింది. వరుణ్ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. ఇటలీలోని టస్కానీలో ఈ జంట పెళ్లి  జరిగింది. నవంబర్ 1న ఈ స్టార్ కపుల్ వివాహా బంధంతో ఒకటి అయ్యారు. ఇటలీ, టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిగింది.  వైమానిక దళ వీరుల ధైర్య సాహసాలను, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటోన్న సవాళ్ల నేపథ్యంలో ఆపరేషన్ వాలంటైన్ ను తెరకెక్కించాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 1న గ్రాండ్ గా రిలీజ్‌ కానుంది.

మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ శివార్లలోని మల్లారెడ్డి వుమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో సందడి చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పెళ్లి తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులేంటని స్టార్ యాంకర్‌ సుమ వరుణ్ ని అడిగింది. దీనికి ఫోన్‌కాల్స్‌ ఎక్కువగా వస్తున్నాయని, ఎక్కడికెళ్తున్నావనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు వరుణ్ తేజా. అలాగే మరో ప్రశ్నకు ఈ ఏడాది వేలంటైన్స్ డే కు తన భార్య లావణ్య త్రిపాఠి ఎలాంటి గిఫ్ట్‌ ఇవ్వలేదని తెలిపారు. అయితే ఇద్దరూ విహార యాత్రకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: