మూడు సార్లు రీ రిలీజై.. భారీ కలెక్షన్స్ సాధించిన సాయి పల్లవి మూవీ?
నవీన్ పౌలి, సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన ఈ మలయాళ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆల్ఫోన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2015లో విడుదలైంది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 75 కోట్ల వరకు వసూళ్లను సాధించింది అని చెప్పాలి. ఇక తమిళనాడులోని ఎన్నో థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తెలుగులో కూడా ఇదే టైటిల్ తో ఈ సినిమాను నాగచైతన్య తో రీమేక్ చేయగా.. ఇక్కడ సూపర్ హిట్ అయింది.
అయితే సాయి పల్లవి నటించిన ప్రేమమ్ మూవీ ని ఏకంగా మూడుసార్లు రీ రిలీజ్ చేయగా. మూడుసార్లు కూడా సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. 2015లో విడుదలైన ఈ మూవీని 2016లో వాలంటైన్స్ డే సందర్భంగా తమిళంలో రిలీజ్ చేశారు. ఇక అప్పుడు కూడా ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 2017లో మరోసారి ఈ మూవీని రిలీజ్ చేయగా.. ఇక మరోసారి భారీగా వసూళ్లు సాధించింది ప్రేమమ్ సినిమా. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 1న తమిళనాడులో ఈ సినిమానిరీ రిలీజ్ చేయగా.. కేవలం ఐదు రోజుల్లోనే రెండు కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇలా మూడుసార్లు రీ రిలీజ్ అయిన ఈ సినిమాకు ఎక్కడా క్రేజ్ తగ్గలేదు అని చెప్పాలి.