మహేష్ బాబు సినిమాలో నటించిన ఈ బుడ్డోడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
ఇక హీరోయిన్లలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకులను మెప్పించిన కావ్య కూడా ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తూ ఉంది అని చెప్పాలి. ఇలా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి మెప్పించిన వారు.. ఇప్పుడు హీరో హీరోయిన్లుగా ఉన్నారు. అయితే ఇక ఇప్పుడు మరో బుడ్డోడు ఇలా ఇండస్ట్రీలో హీరోగా పరిచయమయ్యాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వచ్చిన కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఈ సినిమాతో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ మ్యాజిక్ చేశాడు అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.
సినిమాలో హీరో హీరోయిన్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది ఈ బుడ్డోడే. అయితే అతడు సినిమాలో దీపక్ చాలా సీన్స్ లో కనిపిస్తాడు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన దీపక్ ఇప్పుడు హీరోగా మారిపోయాడు. కొత్త డైరెక్టర్ యశస్వి దర్శకత్వంలో దీపక్ సరోజ్ హీరోగా సిద్ధార్థ రాయ్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవల లాంచ్ చేశారు. ఏకంగా అర్జున్ రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఈ ట్రైలర్ చూస్తే గుర్తుకు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. మరి దీపక్ ఎంతలా హీరోగా సక్సెస్ అవుతాడో చూడాలి.