బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి మరియు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలలో నటించిన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్ బాగా పాపులర్ అవుతోంది.ఈ సిరీస్ కు భారీగా వ్యూస్ వస్తున్నాయి.అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో జనవరి 19వ తేదీన ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు వచ్చింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు ఉర్దూ సహా మరిన్ని భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్కు పాజిటివ్ టాక్ వస్తుండటంతో భారీగా వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈ సిరీస్ భారత్తో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈ మరియు సింగపూర్ సహా మరిన్ని దేశాల్లో ప్రస్తుతం టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ తాజాగా వెల్లడించింది. భారత్లో ప్రస్తుతం టాప్లో ఈ వెబ్ సిరీస్ ట్రెండ్ అవుతోంది.ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్పై సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఇంటెన్స్గా ఉన్న స్టోరీ, ఉత్కంఠగా ఉన్న డ్రామా సహా సిద్ధార్థ్ మల్హోత్రా మరియు శిల్పా శెట్టి యాక్టింగ్ను ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్కు రోహిత్ శెట్టి మరియు సుశ్వాంత్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ను రోహిత్ శెట్టి క్రియేట్ చేసిన తీరుపై కూడా ప్రశంసలు వస్తున్నాయి.ఈ సిరీస్లో సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టితో పాటు వివేక్ ఒబెరాయ్, మయాంక్ టాండన్, నితిన్ ధీర్, ఇషా తల్వార్, శ్వేత తివారీ, శరద కేల్కర్, వైదేహి పరశురామి మరియు ముకేశ్ రిషి తదితరులు కీలకపాత్రలు పోషించారు. లిజో జార్జ్ - డీజే చీతాస్ ఈ సిరీస్ కు సంగీతం అందించారు.ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ కథ ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల చుట్టూ తిరుగుతుంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగే ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ కు మరిన్ని సీజన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.