ఆ టాప్ నిర్మాతల చేతిలోకి దేవర బాధ్యతలు..?

Purushottham Vinay
టాలీవుడ్ లో చాలా తక్కువ టైం లోనే పెద్ద నిర్మాణ సంస్థగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ మరో వైపు డిస్టిబ్యూషన్ లో కూడా ఇప్పుడు స్పీడ్ గా దూసుకుపోతోంది. పెద్ద సినిమాలకి సంబందించిన రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకుంటూ ఎన్నో లాభాలని సొంతం చేసుకుంటుంది.ఇక తాజాగా సంక్రాతి పండుగ బరిలో రిలీజ్ అయినా హనుమాన్ మూవీ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకొని రిలీజ్ చేసి భారీ లాభాలని ఆర్జిస్తోంది. ఇక డిస్టిబ్యూషన్ రంగంలో మరింత స్పీడ్ గా ముందుకి వెళ్లాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోంది. కేవలం ఒక ఏరియాకి మాత్రమే పరిమితం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పంపిణీ రంగంలో దూసుకుపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ అడుగులు వేస్తోంది. దిల్ రాజు లాగానే సొంతంగా థియేటర్స్ ని కూడా నిర్మించే ప్లాన్ లో మైత్రీ నిర్మాతలు ఉన్నారు.ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా జూనియర్ ఎన్ఠీఆర్ దేవర మూవీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.


ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రిలీజ్ రైట్స్ ని భారీ ధరకి మైత్రీ డిస్టిబ్యూషన్ కంపెనీ సొంతం చేసుకుందని సమాచారం తెలుస్తుంది.నిర్మాతలు తెలుగు రాష్ట్రాల కోసం ఏకంగా 110 కోట్లు డిమాండ్ చేశారట. ఈ డీల్ కి సంబందించిన ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం తెలుస్తోంది. దాదాపు క్లోజ్ అయ్యే స్టేజ్ లో చర్చలు ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల డీల్ అంటే ఎక్కువ మొత్తమని చెప్పొచ్చు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉన్నాయి.అందుకే భారీ ధర చెల్లించి మైత్రీ నిర్మాతలు సొంతం చేసుకున్నారట. దేవర మూవీతో బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.అలాగే సైఫ్ అలీఖాన్ కూడా తెలుగులోకి తెరంగేట్రం చేస్తున్నారు.ఇంకా అలాగే స్టార్ క్యాస్టింగ్ ఈ మూవీలో కనిపించబోతున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: