ఇండస్ట్రీలో మరో జంట విడాకులు.. వేణు స్వామి చెప్పింది నిజమవుతుందా?

praveen
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సిరి సెలెబ్రిటీలు రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాడు వేణుస్వామి  అయితే మొదట్లో ఈయన చెప్పేవి ఎవరూ నమ్మేవారు కాదు. కేవలం పాపులారిటీ కోసం మాత్రమే సినీ సెలబ్రిటీల గురించి ఇలా మాట్లాడుతున్నారు అని ట్రోలింగ్ చేసేవారు. కానీ ఈయన చెప్పిన విషయాలలో చాలా నిజాం కావడంతో ఈయనను నమ్మడం మొదలుపెట్టారు అందరూ.

 ఏకంగా సినిమా హీరోయిన్లు సైతం ఈయనని ఇంటికి పిలిపించుకొని తమ కెరియర్ బాగుండాలని ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం కూడా చూశాము. అయితే గతంలో నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటారు అని చెప్పాడు వేణు స్వామి. అయితే అంత అన్యోన్యంగా ఉన్న సమంత, నాగచైతన్య వినాకులు తీసుకోవడం ఏంటి అని అందరూ అనుకున్నారు. చివరికి వేణు స్వామి చెప్పిందే నిజమైంది. సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని వేరపడ్డారు.

 ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ షాకింగ్ విషయం చెప్పడంతో మరోసారి వేణు స్వామి వార్తల్లో హాట్ టాపిక్ గామారిపోయాడు. ఆ సినీ సెలబ్రిటీ జంట ఎవరో కాదు నాయన తార, విగ్నేష్ శివన్. గతంలో నయనతారకు పెళ్లి సెట్ కాదని చెప్పాడు వేణు స్వామి. ఇక పెళ్లి తర్వాత ఎన్నో ఇబ్బందులు వస్తాయని వెల్లడించాడు. పెళ్లి తర్వాత విడాకులు కూడా తీసుకుంటారు అని చెప్పాడు. అయితే ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే వేణు స్వామి చెప్పిన మాటలు నిజమవుతాయేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పెళ్లయిన కొన్ని రోజులకే తిరుమల ఇష్యూ నడిచింది. ఆ తర్వాత పిల్లల కారణంగా కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఇంకా అన్నపూర్ణ సినిమాపై కేసు.. ఇలా నయనతార ఇబ్బందులు పడుతూనే ఉంది. దీంతో ఇక విడాకులు కూడా నిజమవుతాయి అని చాలామంది అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: