జ్యోతిష్యుడు వేణు స్వామి.. గంటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

praveen
జ్యోతిష్యుడు వేణు స్వామి.. ఈయన గురించి పరిచయం చేస్తే అది అతిశయోక్తే అవుతుంది. ఎందుకంటే నేటి రోజుల్లో టాలీవుడ్ లో ఈయన గురించి తెలియని ప్రేక్షకులు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రభాస్ అభిమానులకు అయితే ఈయన గురించి ఇంకా బాగా తెలుసు. వాళ్లది వీళ్లది ఎందుకు ఏకంగా సినీ సెలబ్రిటీలది జాతకం చెప్పేద్దాం అనుకున్న వేణు స్వామి అందరి జాతకాలను బయటపెట్టేసాడు. అయితే మొదట్లో ఈయన చెప్పేవన్నీ ట్రాష్ అని అందరూ కొట్టి పారేసారూ. కేవలం పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఆ తర్వాత వేణు స్వామి చెప్పిన ఎన్నో విషయాలను నిజం కావడంతో.. ఇక ఈయనను నమ్మడం మొదలుపెట్టారు ప్రేక్షకులు.

 అయితే కేవలం సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం వేణు స్వామిని ఇంటికి పిలిపించుకొని మరి ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం.. మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం వేణు స్వామికి అస్సలు కలసి రావట్లేదు. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ ఎక్కడ నిజాలు కావట్లేదు. కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని చెబితే ఆయన ఓడిపోయారు. ప్రభాస్ మళ్ళీ ఫ్లాప్ చవిచూస్తారని చెబితే సలార్ తో సూపర్ హిట్ కొట్టాడు. ఇలా వేణు స్వామి చెప్పిన మాటలు నిజం కాకపోవడంతో ఈయనపై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

 అయితే ఇలా సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతున్న వేణు స్వామి అసలు ఎంత పారితోషకం తీసుకుంటారు అన్నది ఎవరికి తెలియని విషయం విషయం. అయితే దీనికి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఎవరిదైనా జాతకం చెప్పాలంటే వేణు స్వామి గంట సమయం తీసుకుంటారట. అయితే గంటకు 5000 రూపాయలు పుచ్చుకుంటారట వేణు స్వామి. కాగా వేణు స్వామికి రెండు బిజినెస్ లు ఉన్నాయి. ఒకటి జ్యోతిష్యం అయితే.. మరొకటి పబ్. తన జాతకం ప్రకారం తనకు ఏ రంగం అయితే కలిసి వస్తుందోనని చూసుకున్న ఆయన.. పబ్ నిర్వహిస్తే బిజినెస్ బాగుంటుందని అర్థం చేసుకొని పబ్ పెట్టారట. ఈ విషయాన్ని గతంలో ఆయన పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: