2030 వరకు ఎన్టీఆర్ ఆ పని చేయకూడదట.. వేణు స్వామి కామెంట్స్ వైరల్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అంతే తెలియని వారు లేరు అనడంలో సందేహం లేదు. సాధారణంగా జ్యోతిష్యులు అనగానే ఇక తమ దగ్గరికి వచ్చిన వారికి జాతకం చెబుతూ ఉంటారు. కానీ వేణు స్వామి వాళ్లది వీళ్లది జాతకం చెబితే ఏం వస్తుంది నేరుగా సినీ సెలబ్రిటీల భవిష్యత్తు ఏంటో చెబితే ఒక్కసారిగా గుర్తింపు వస్తుంది అనుకున్నాడో ఇంకేం అనుకున్నాడో తెలియదు. కానీ ఇక సినీ సెలబ్రిటీల జాతకం చెప్పడం మొదలెట్టాడు. అదృష్టం కొద్ది ఆయన చెప్పిన విషయాలు కొన్ని నిజం కావడంతో చివరికి ఆయనను నమ్మడం మొదలుపెట్టారు.

 గతంలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని వేణు స్వామి చెప్పినప్పుడు..  పాపులారిటీ కోసం ఇదంతా చెబుతున్నాడు అని అనుకున్నారు అందరూ. కానీ ఆ తర్వాత ఇది నిజంగానే జరగడంతో ఇక వేణు స్వామి చెప్పింది జరుగుతుంది అని నమ్మడం మొదలుపెట్టారు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆయనను పిలిపించుకొని ఇంట్లో పూజలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.

 జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఎంత గుర్తింపును సంపాదించుకోవాలో అంత గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆయన రాజకీయ అరంగేట్రం ఎప్పుడు ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇక రాజకీయాలపై అటు ఎన్టీఆర్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే ఈ విషయంపై జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన విషయాలు బయట పెట్టాడు. వేణు స్వామిని ఎన్టీఆర్ తల్లి షాలని ఓసారి తిరుపతి దేవస్థానంలో కలిసిందట  ఆ సమయంలో వేణు స్వామి ఎన్టీఆర్ జాతకం చూసి ఆయనకు రాజయోగం ఉంది.. అద్భుతంగా దూసుకుపోతారని చెప్పారట. ఆయనకు ఒక విషయంలో మాత్రం దోషం ఉందని చెప్పారట వేణు స్వామి. ఎన్టీఆర్ ది మక నక్షత్రమట. ఇక దివంగత జయలలితది కూడా ఇదే నక్షత్రమట. తారక్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తే మంచి పొజిషన్లోకి వెళ్తారని రాసిపెట్టి ఉండదని రాజకీయాల్లోకి వెళ్లే సమయం మాత్రం 2030 తర్వాతే అని వేలు స్వామి చెప్పుకొచ్చారు. అలోపు తొందరపడి రాజకీయాల్లోకి వస్తే అసలు కలిసి రాదని చెప్పారట వేణు స్వామి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: