ఆ రోజున ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్న కోటబొమ్మాళి పీఎస్....!!

murali krishna
సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కోట బొమ్మాళి పీఎస్'. ఈ సినిమా విడుదలకు ముందే ఈ లోని లింగిడి అనే సాంగ్ సోషల్ మీడియా లో సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ పాటకు ప్రతి ప్రేక్షకుడు స్టెప్పులేశారు. దీంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకుండానే ఫుల్‏గా పబ్లిసిటీ వచ్చేసింది. తేజా మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మలయాళీ సూపర్ హిట్ ‘నాయాట్టు’ రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ 2 సంస్థ నిర్మించింది. నవంబర్ 24 న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తీసుకువచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ న్యూఇయర్ వీకెండ్‏లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జనవరి 5 న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కానీ తర్వలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఒక రాజకీయ నాయకుడి కారణంగా ముగ్గురి పోలీసుల జీవితాలు తారుమారవుతాయి. ఆ తర్వాత ఓరోజు రాత్రి ఈ ముగ్గురు ప్రయాణిస్తున్న కారు యాక్టిడెంట్ కావడం..ఆ ప్రమాదంలో నియజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణిస్తాడు. దీంతో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేయాలనే డిమాండ్ బాగా పెరుగుతుంది. దీంతో ఈ ముగ్గురి పోలీసుల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.అనేది కోట బొమ్మాళి కథ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: