బాలీవుడ్ సుందరిని దింపుతున్నా సుకుమార్...!!

murali krishna
టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ''పుష్ప ది రూల్'' ఒకటి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే అంచనాలు భారీ లెవల్లో ఉన్నాయి.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు పోటీ లేకుండా సేఫ్ జోన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ రిలీజ్ డేట్ ను ఖరారు చేసారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను రంగం లోకి దించుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. పార్ట్ 1 లో స్టార్ హీరోయిన్ సమంతతో ఐటెం సాంగ్ చేయించి యూత్ తో ''ఊ అంటావా మావ ఊఊ అంటావా'' అని స్టెప్పులు వేయించారు. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా పార్ట్ 2 లో ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసారని తెలుస్తుంది.ఈ సాంగ్ ను బిటౌన్ హీరోయిన్ జాన్వీ కపూర్ తో చేయించాలని ప్లాన్ చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. అలాగే జాన్వీ కపూర్ తో థియేటర్స్ ఊగిపోయేలా స్టెప్పులు వేయించబోతున్నట్టు టాక్.. మరి జాన్వీ కపూర్ ఈ సాంగ్ లో చిందేయడానికి ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: