బాలీవుడ్ టాప్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించి నిర్మించిన లేటెస్ట్ మూవీ జవాన్. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై బజ్ ని పెంచింది.ఈ మూవీ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. షారుఖ్ ఈ సినిమాలో చాలా గెటప్స్లో కనిపించాయి . విడుదలకు ఇంకా వారం రోజుల సమయం ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. అయితే టికెట్ ధరలు మాత్రం గట్టి షాక్ కొట్టేలా ఉన్నాయి. బెంగళూరులో 'జవాన్' సినిమా టిక్కెట్లను ఏకంగా రూ.2400కి విక్రయిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఇప్పుడు మాస్ జోన్లో కనిపిస్తున్నాడు. 'పఠాన్' మూవీలో సాలిడ్ యాక్షన్ చేశాడు. 'జవాన్' లో కూడా అది కొనసాగుతుందనడానికి ప్రివ్యూ వీడియో, ట్రైలర్లే నిదర్శనం. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియా, బాలీవుడ్ కలయికలో రూపొందిన సినిమా ఇది. ఇక ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ 'జవాన్' చిత్రానికి దర్శకత్వం వహించారు. నయనతార ఈ మూవీలో హీరోయిన్గా నటించింది. అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్లు సన్యా మల్హోత్రా ఇంకా దీపికా పదుకొణె కూడా కీ రోల్స్లో కనిపించనున్నారు.
ఈ సినిమాపై యావత్ ఇండియాలో క్యూరియాసిటీ నెలకొంది.బెంగళూరులోని డైరెక్టర్స్ కట్ థియేటర్లో 'జవాన్' సినిమా టిక్కెట్ ధర రూ. 2400. పైగా ఇది లగ్జరీ మల్టీప్లెక్స్ కాబట్టి, టిక్కెట్ ధర కూడా ఆ రేంజ్లోనే ఉంది. ఇంకా అలాగే సాధారణ మల్టీప్లెక్స్ లలో కూడా టిక్కెట్ ధర ఎక్కువగానే ఉంటుంది. లులు మాల్లోని సినీపోలీస్లో నైట్ షోల టిక్కెట్ ధర కూడా రూ.1600గా ఉంది. అలాగే బిన్నిపేట్ సినీపోలీస్లో గరిష్ట ధర రూ.750 గా ఉంది. జవాన్ మూవీ ' టిక్కెట్ ధర చాలా మల్టీప్లెక్స్లలో 250 రూపాయల నుంచి స్టార్టవుతుంది. ఇక సింగిల్ స్క్రీన్లలో ధర గురించి సమాచారం ఇంకా రాలేదు. టిక్కెట్టు ధర ఇంత ఎక్కువ అయితే సామాన్యులు ఎలా చూస్తారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఫిల్మ్ లవర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 7న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాకి అనురుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు జవాన్ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ప్రిరిలీజ్ బిజినెస్ కూడా జోరుగా జరుగుతుంది.