ఆ స్టార్ హీరో కి గట్టి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్...!!
అయితే వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ తరఫున శింబుపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శింబుతో జరిగిన ఒప్పంద పత్రంలో కేవలం 1 కోటి రూపాయలు చెల్లించినట్టు స్పష్టమైంది. అయితే 4.5 కోట్లు చెల్లించినట్టు ఎక్కడా లేకపోవడంతో కోర్టు కేవలం 1 కోటి రూపాయలు దాఖలు చేయాలని తన తీర్పులో వెల్లడించింది.హీరో శింబుపై వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అబ్దుల్ ఖుదోస్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా కుమార్ సినిమా పూర్తి చేయకుండా మరో సినిమాలో నటించకూడదు అని నిర్మాత చేసిన డిమాండ్ను పరిగణనలోకి తీసుకొన్నది. దాంతో అడ్వాన్సుగా చెల్లించిన 1 కోటి రూపాయలు మూడు వారాల్లోగా కోర్టులో దాఖలు చేయాలని శింబుకు కోర్టు సూచించింది.
అయితే కోటి రూపాయలు అడ్వాన్సుతోపాటు శింబుకు బ్యాంకు ద్వారా చెల్లించినట్టు ఆధారాలను నిర్మాత చూపించారు. అయితే వాటికి సరైన ఆధారాలు లేని కారణంగా ఆ 4.5 కోట్ల మొత్తాన్ని చెల్లించినట్టు రుజువు చేయలేం. కాబట్టి కోటి రూపాయలు మూడు వారాల్లోగా చెల్లించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది.అయితే మద్రాస్ కోర్టు ఆదేశాల తర్వాత శింబు గానీ, ఆయన పీఆర్ వర్గాలు కానీ పెద్దగా స్పందించలేదు. కోర్టులో కోటి రూపాయలు జారీ చేస్తారా? గడువులోగా ఆ మొత్తాన్ని చెల్లిస్తారా? లేదా పై కోర్టుకు అప్పీల్ చేసుకొంటారా? అనేది ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.