టీజర్: తిరగబడారాస్వామి అంటూ వస్తున్న రాజ్ తరుణ్..!!

Divya
యంగ్ హీరో రాజ్ తరుణ్ కి సరైన సక్సెస్ లేక ఇప్పటికి చాలా కాలం అవుతోంది. ఎన్నో చిత్రాలలో నటించిన సరైన సక్సెస్ రాలేదు.. మొదట్లో తన సినిమాలతో బాగానే సక్సెస్ అయిన రాజు తరుణ్ ఈ మధ్యకాలంలో ఫెయిల్యూర్ హీరోగా మిగిలారు. ఇప్పుడు తాజాగా తిరగబడరా స్వామి అనే చిత్రంతో రాజ్ తరుణ్ మళ్లీ తన స్టామినా చూపించాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజు తరుణ్ సరసన మాల్వి మల్హోత్రా మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.. తాజాగా ఈ సినిమా టీజర్ ని దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు అమాయకంగా ఉండే ఒక కుర్రాడు తన జీవితంలో ఎదురైన పరిస్థితుల వల్ల వైలెన్స్  గా ఎలా మారుతారు అనే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.. ఈ టీజర్ చూస్తే మనకి అర్థమవుతోంది. రాజ్ తరుణ్ కూడా బాలయ్య బాబు అభిమానిగా ఇందులో చూపించడం జరిగింది అన్ని వర్గాల ఆడియన్స్ను కూడా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.

లవ్ స్టోరీ ,ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలు ఇలా అన్నీ కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది మళ్లీ మలహోత్ర ఎంతో అందంగా అలాగే మాస్ అపీరియన్స్ తో కూడా అదరగొట్టేస్తోంది. ఇందులో రొమాన్స్ కూడా చాలానే ఉన్నట్లు తెలుస్తోంది.విలన్ గా మకరందేస్ పాండే నటించబోతున్నారు. ఇందులో ఈ నటుడు చెప్పే డైలాగులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి చివరిలో చెప్పే డైలాగ్ జై బాలయ్య అనేది కూడా అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. మొత్తంగా ఒక వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఏమి అరకు రాజు తరుణ్ కెరీర్ కు ఏ సినిమా సహాయపడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: