టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా నందమూరి బాలకృష్ణ ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటాడు. మరో 20 రోజుల్లో రామ్ పోతినేని మరియు బోయపాటి కాంబినేషన్లో వస్తున్న 'స్కంద' సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు చిత్రబంధం. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను పై అభిమానంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక మరోవైపు స్కంద సినిమాలో మరియు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది శ్రీ లీల. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు. అలా బాలయ్య బోయపాటి కాంబినేషన్ సినిమాపై కూడా ఏదైనా అప్డేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో సింహ ,లెజెండ్, అఖండ వంటి సినిమాలు వచ్చాయి. ఊహకందని విధంగా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి ఆ సినిమాలు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య మరియు బోయపాటి కాంబినేషన్ లో సినిమా 2024 ఎన్నికల తర్వాత స్టార్ట్ కానుంది అని అంటున్నారు.
తన సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో చూపించడానికి ఎక్కువగా ఇష్టపడతాడు బోయపాటి. రాబోయే రోజుల్లో బాలయ్యతో మల్టీస్టారర్ సినిమాలో చేయాలని ఆ కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు బోయపాటి. సినిమా సినిమాకి అంచనాలను మించేలా తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్య మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి..!!