టాలీవుడ్ లో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక పేరుని తెచ్చుకున్న
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్
మూవీ ఖుషి. ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది సమంత. కాగా ఈ సినిమాని మైత్రి
మూవీ పతాకం పై నవీన్ ఎర్నేని వైరస్
శంకర్ ఎలమంచిలి కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
శివ నిర్వనా దర్శకత్వంలో ఈ
సినిమా రాబోతోంది.
మురళి ఛాయాగ్రహణంను హిస్సాన్ అబ్దుల్ సంగీతాన్ని అందించారు. ఇక నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ
సినిమా తెలుగు తమిళం కన్నడ మలయాళ
హిందీ భాషల్లో పాన్
ఇండియా స్థాయిలో ఒకేసారి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
కాగా ఈ సినిమాని తమిళనాడులో లైక్ ఆ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా
శ్రీ లక్ష్మీ
మూవీ సంస్థ అధినేత ఎన్వి
ప్రసాద్ కేరళలో
నిర్మాత డిస్ట్రిబ్యూటర్
ముఖేష్ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని సోమవారం సాయంత్రం చిత్ర బృందం చెన్నైలోని
ప్రసాద్ ల్యాబ్లో
మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత ఆర్.బి
చౌదరి ముఖ్యఅతిథిగా
నిర్మాత ఎం
వి ప్రసాద్ మాట్లాడుతూ మైత్రి
మూవీ మేకర్ సంస్థ నిర్మించిన సినిమాలు 90% వరకు విజయాలను అందుకున్న
ఖుషి సినిమాకి తమిళనాడులో మంచి రెస్పాన్స్ వస్తుందని చాలా నమ్మకంగా ఉన్నాం అని అన్నారు.
అనంతరం
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తాను ఇంతకుముందు నటించినా పెళ్లి చూపులు అర్జున్
రెడ్డి గీతగోవిందం సినిమాలో కాలం నుండి తనపై ప్రేమాభిమానాలు చూపుతున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక తమిళం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో స్టార్ ఉన్నారని జాతీయ స్థాయిలో వెలిగిపోతున్న ఒకే ఒక
సూపర్ స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు. ఆయన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోవాలి అని అనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా పేర్కొన్నాడు విజయ్. అనిరుద్
సంగీత దర్శకత్వంలో ఒక
సినిమా చేయాల్సిందని అది మిస్ అయిందని త్వరలోనే తమ కలిసి పని చేస్తామని
విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా చెప్పాడు..!!