సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో
శ్రీ లీలా మరియు మీనాక్షి
చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ
సినిమా వచ్చే ఏడాది
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇక ఈ
సినిమా తరువాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో ఒక
సినిమా చేయబోతున్నారు. ఇక ఈ
సినిమా విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా మహేష్ బాబు ఎంత మంచోడో చాలామందికి తెలిసి ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు
ముందుంటాడు మన మహేష్ బాబు. ఫ్యామిలీతో ఎంతో టైం స్పెండ్ చేస్తాడు వివాదాలకు వివాదాస్పద వ్యాఖ్యలకు ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్ చేస్తూ నిత్యం జిమ్ లోనే కనిపిస్తాడు మహేష్ బాబు. అలాంటిది మహేష్ బాబుకి ఒక పెద్ద వ్యాసం ఉంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆ సమస్య నుండి బయటపడదామని ఎంత ప్రయత్నించినా కూడా మహేష్ బాబుకి అది సాధ్యం కావడం లేదని అంటున్నారు. ఇంతకీ మహేష్ బాబుకి ఉన్న ఆ వ్యాధి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక ఆ వ్యాధి
స్మార్ట్ ఫోన్ అట. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన కూడా
ఫోన్ వైపే మహేష్ బాబు మనసు లాగేస్తూ ఉంటుందట. తాజాగా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించేడు మహేష్ బాబు. మల్టీ స్పోర్ట్స్ కంపెనీ బిగ్ సి 20వ వార్షికోత్సవ సంబరాల్లో బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు సందడి చేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగా
మీడియా సమావేశంలో పాల్గొన్న మహేష్ బాబు ఈ విషయాన్ని పేర్కొన్నాడు.
ఫోన్ ని గంటల తరబడి వాడతాను అని.. అది తనకు ఒక వ్యసనంగా మారిపోయింది.. అంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. ఉదయం నిద్ర లేవగానే మొదలుపెడితే రోజంతా
ఫోన్ తోనే గడిపేస్తాను అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు..!!