తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇకపోతే చరణ్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న సినిమాలలో రంగస్థలం మూవీ ఒకటి. ఈ సినిమాలో చరణ్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటి సమంత హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... ఈ మూవీ లో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ లో నటించింది. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా 2018 వ సంవత్సరం తెలుగు భాషలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డ్ లను సృష్టించింది. ఇకపోతే ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తాజాగా జూలై 14 వ తేదీన జపాన్ లి విడుదల చేశారు.
ఇకపోతే జపాన్ లో ఈ మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి జపాన్ లో విడుదల అయిన సినిమాల్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాగా రంగస్థలం నిలిచింది. ఈ విషయాన్ని మైత్రి సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.