ఆ కారణంగా రానా కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నటుడు నవదీప్...!!

murali krishna
తెలుగు సినీ ఇండస్ట్రీ లో హీరో గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నవదీప్ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే తాజా గా నవదీప్,ఈషా రెబ్బ, నరేష్ హరితేజ ఝాన్సీ వంటి వారు ప్రధాన పాత్రల లో నటించినటు వంటి సిరీస్ మాయ బజార్ ఫర్ సేల్. గేటెడ్ కమ్యూనిటీ లోని కుటుంబా లకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాల తో తెరకేక్కిన ఈ సిరీస్ జీ 5 లోప్రసారం కాబోతోంది. ఈ సిరీస్ జూలై 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యం లో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల లో భాగం గా తాజా గా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక లో భాగం గా నవదీప్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. ఇక ఈ సిరీస్ ను జీ 5 తో పాటు రానాకు సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సీరియస్ నుంచి విడుదలైనటు వంటి పోస్టర్, ట్రైలర్ పెద్ద ఎత్తున అందరిని ఆకట్టుకుంది. తాజా గా నిర్వహించిన ఈవెంట్ లో నవదీప్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ఒకప్పుడు పల్లెటూర్లో ప్రజలందరూ సాయంత్రం అయితే ఒకచోట కూర్చొని ఎంతో సరదా గా ముచ్చట్లు పెట్టుకునే వారు. ఈ సిరీస్ లో కూడా అలాంటి కథాంశాలను డైరెక్టర్ చాలా అద్భుతం గా చూపించారని నవదీప్ తెలిపారు. ఎప్పుడో రామానాయుడు  గారు మొదలు పెట్టిన ఓ అఖండ దీపాన్ని ఎంతో విజయవంతం గా ముందుకు తీసుకు వెళుతూ యంగ్ టీమ్, యంగ్ ప్రొడక్షన్ ను తెర పైకి తీసుకు వస్తున్న మా రానా కు ఆల్ ద బెస్ట్ అంటూ ఈ సందర్భం గా నవదీప్ రానా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: