బిగ్ బాస్ కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్న సరికొత్త రూల్స్...!!

murali krishna
బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రస్తుతం తెలుగు లో ఏడవ సీజన్ ప్రారంభం కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్యక్రమం నుంచి అప్డేట్ ఇస్తూ లోగో ప్రోమో విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే గత సీజన్ పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందలేకపోయింది కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ప్రతి విషయంలోనూ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గత సీజన్లలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్లు బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే కంటెస్టెంట్ ల గురించి తీవ్రస్థాయి లో నెగిటివ్ కామెంట్లు చేసేవారు.ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ కారణంగా మొత్తం బిగ్ బాస్ కార్యక్రమం పైనే ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పడటం తో షో రేటింగ్ భారీగా తగ్గిపోతుందని మేకర్స్ అభిప్రాయానికి వచ్చారు. దీంతో ఈసారి అలా జరగకుండా ఉండడం కోసం కంటెస్టెంట్లకు చాలా కఠినమైన రూల్స్ పెట్టారని తెలుస్తుంది.
బిగ్ బాస్ హౌస్లో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఎలిమినేట్ అవుతారో అలాంటివారు పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంటారు. అయితే ఈ ఇంటర్వ్యూలలో ఎక్కడైనా వారు బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే అందులో ఉన్నటువంటి కంటెస్టెంట్ల గురించి నెగటివ్ గా మాట్లాడితే వారి రెమ్యూనరేషన్ లో సగం కోత ఉంటుందని కఠిన నియమాన్ని నిర్వాహకులు ముందుగానే కంటెస్టెంట్లకు హెచ్చరించారట.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే కంటెస్టెంట్ లో ఎంపిక కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి మరొక అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: